
హైదరాబాద్, వెలుగు: దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద సీఎస్ఆర్ కింద లింక్ రోడ్డు నిర్మించేందుకు ఎన్సీసీ కంపెనీ ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ లింక్ రోడ్ నిర్మించే స్థలాన్ని పరిశీలించారు. దుర్గం చెరువు మెయిన్గేట్ నుంచి ఫుట్ పాత్ మీదుగా టీ సాట్ వైపు కేబుల్ బ్రిడ్జి వరకు లింక్ రోడ్ నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ రోడ్ కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మారనుంది. ఈ రోడ్ ద్వారా మాదాపూర్, జూబ్లీహిల్స్ రోడ్ నెం.36 కు వెళ్లేవారు ట్రాఫిక్ జామ్ సమస్య లేకుండా వెళ్లొచ్చు. ఈ రోడ్ నిర్మాణానికి భూసేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు.