ఈ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు

ఈ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్నుకోబడిన జగదీప్ ధన్‌కర్‌ నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో జగదీప్ తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. నాలాంటి నిరాడంబరమైన నేపథ్యం ఉన్న వ్యక్తికి ఈ అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదని జగదీప్ ధన్‌ఖర్ ఈ సందర్భంగా అన్నారు. రేపటితో (జులై 19) నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో.. మరోవైపు  జగదీప్‌ ధన్‌ఖర్ కు మద్దతు కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇటీవలే బీజేపీ చీఫ్ జేపీ నడ్డా  జగదీప్ ధన్‌కర్‌ను ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఎన్డీఏ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.  అటు కర్నాటకకు చెందిన మాజీ మహిళా గవర్నర్‌ మార్గరెట్‌ ఆల్వాను విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిపారు.