జేపీ నడ్డాను కలిసిన న్యూజిలాండ్ నేతలు

జేపీ నడ్డాను కలిసిన న్యూజిలాండ్ నేతలు

భారత్ లో పర్యటిస్తున్న న్యూజీలాండ్ ప్రతిపక్ష నాయకుడు సైమన్ బ్రిడ్జెస్ బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. కివీస్ బృందానికి స్వాగతం పలికారు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా. తర్వాత వారితో పలు అంశాలపై చర్చించారు. భారతదేశంలో ఎన్నికల నిర్వహణ, పాలనా వ్యవహారాలపై నడ్డాతో న్యూజీలాండ్ నేతలు చర్చించారు. ఇరు దేశాల మధ్య  సంబంధాలపైనా మాట్లాడుకున్నారు.