తెలంగాణలో మరో 1,440 కరోనా కేసులు

తెలంగాణలో మరో 1,440 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,440 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 2,50,331 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి అయిదుగురు చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1,377కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 1,481 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 2,29,064గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 19,890 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా.. మరో 17,135 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 42,673 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 46,18,470 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.55 శాతంగా మరియు రికవరీ రేటు 91.50 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 278, మేడ్చల్ 133, రంగారెడ్డి 112, భద్రాద్రి 97, ఖమ్మం 91, నల్గొండ 70, కరీంనగర్ 68, సూర్యపేట్ 48, సిద్ధిపేట్ 42, వరంగల్ అర్బన్ 39 కేసులు నమోదైనట్లు రోగ్యశాఖ తెలిపింది.

For More News..

దసరా అయిపాయె.. ‘డబుల్​ బెడ్రూం’ రాకపాయె

ఐటీ పార్కు ప్లేస్‌‌లో పల్లీలు వేసుకుంటున్న రైతులు

మూడు నెలల్లో యాదాద్రి ఓపెన్​