తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు.. 10 మంది మృతి

తెలంగాణలో మరో 1,949 కరోనా కేసులు.. 10 మంది మృతి

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,949 కొత్త కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. దాంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 1,99,276 కేసులు నమోదయ్యాయి. తాజాగా శనివారం కరోనా బారినపడి 10 మంది చనిపోయారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 1163కు చేరింది. రాష్ట్రంలో కొత్తగా 2,366 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారిసంఖ్య 1,70,212గా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 27,901 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు తెలిపింది. కాగా.. 22,816 కేసులు హోంఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. శనివారం 51,623 టెస్టులు చేసినట్లు.. ఇప్పటివరకు రాష్ట్రంలో 32,05,249 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో మరణాల రేటు 0.58 శాతంగా మరియు రికవరీ రేటు 85.41 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.

ఇక జిల్లాల్లో నమోదయిన కరోనా కేసుల విషయానికొస్తే.. జీహెచ్ఎంసీలో 291, రంగారెడ్డి 156, మేడ్చల్ 150, నల్గొండ 124, కరీంనగర్ 114, ఖమ్మం 85, సిద్ధిపేట్ 76, భద్రాద్రి 71, నిజామాబాద్ 66, సూర్యపేట్ 65, వరంగల్ అర్బన్ 63, కామారెడ్డి 56, సిరిసిల్ల 55, మహబూబా బాద్ 52 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.

For More News..

ఈఎమ్ఐలు, లోన్లు, క్రెడిట్ కార్డులకు వడ్డీపై వడ్డీ మాఫీ

మాస్కులు లేవు​.. దూరం లేదు.. జాగ్రత్తలు లేకుండానే ఆస్తుల సర్వే

‘స్వదేశీ ఆందోళ‌‌‌‌‌‌‌‌న్’ చేపట్టాలి: గవర్నర్ తమిళిసై