ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం..గర్భంలోనే శిశువు మృతి

ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం..గర్భంలోనే శిశువు మృతి

డెలివరీ కోసం వచ్చిన ఓ మహిళ కడుపులో శిశువు మృతి చెందిన సంఘటన జగిత్యాల ఎంసీహెచ్ లో చోటుచేసుకుంది. గంగాధర మండలం మల్లాపూర్ కు చెందిన జమున డెలివరీ కోసం జగిత్యాల మాతా శిశు ఆసుపత్రిలో మే 10వ తేదీ బుధవారం అడ్మిట్ అయింది. పరీక్షించిన వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారని జమున భర్త శేఖర్ తెలిపాడు.

అయితే బుధవారం సాయంత్రం పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో సిజేరియన్ చేయాలని కోరగా డాక్టర్లు స్పందించలేదు. దీంతో కడుపులోనే శిశువు మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. డెలివరీ కోసం ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లే స్తోమత లేకనే ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే వైద్యులు సరిగా పట్టించుకోవడంలేదని బాలింత తరపు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి శిశువు మృతికి కారణమైన వైద్యులపై చర్యలు చేపట్టాలని శిశువు తండ్రి శేఖర్ డిమాండ్ చేశాడు.