మనసుకు నచ్చని వాడితో కాపురం చేయలేను.. 16 రోజులకే సూసైడ్ చేసుకున్న నవవధువు

మనసుకు నచ్చని వాడితో కాపురం చేయలేను.. 16 రోజులకే సూసైడ్ చేసుకున్న నవవధువు
వరంగల్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన వధువు.. కాళ్ల పారాణి ఆరకముందే.. 16 రోజులకే సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఈ దారుణ ఘటన జిల్లాలోని భీమదెవరపల్లి మండలం మానిక్యపూర్‌లో జరిగింది. ధర్మసాగర్ మండలం నారాయణగిరి గ్రామానికి చెందిన రవళి(22) అనే యువతికి.. మానిక్యపూర్ గ్రామానికి చెందిన యువకుడితో 16 రోజుల కిందట ఘనంగా పెళ్లి జరిగింది. అయితే ఈ పెళ్లి రవళికి ఇష్టంలేదు. దాంతో అయిష్టంగానే కాపురానికి వెళ్లింది. అయితే మనసుకు నచ్చనివాడితో కాపురం చేయలేక ఉరివేసుకొని చనిపోతున్నట్లు లెటర్ రాసి చనిపోయింది. తన ఇష్టంతో సంబంధంలేకుండా బలవంతంగా ఈ పెళ్లి చేశారని వధువు తన సూసైడ్ లెటర్‌లో పేర్కొంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. సూసైడ్ లెటర్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. For More News.. 5 వేలు పెడితే రోజూ 400 ఇస్తామని నమ్మించి.. హీరోగా జానీ మాస్టర్ ఎంట్రీ హీరో రాం చరణ్‌కు కరోనా పాజిటివ్