పోలీసుల అదుపులో నిజామాబాద్ అత్యాచార నిందితులు

పోలీసుల అదుపులో నిజామాబాద్ అత్యాచార నిందితులు

నిజామాబాద్ అత్యాచార ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బస్ కోసం వెయిట్ చేస్తున్న యువతికి మాయామాటలు చెప్పి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. దీనికి సంబంధించి బాధితురాలు బుధవారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో గాలింపు చేపట్టిన పోలీసులు.. ముగ్గురిని పట్టుకోగా.. మరో ఇద్దరి కోసం గాలింపు చేస్తున్నారు. నిందితులపై అట్రాసిటీ, నిర్భయ కేసులు నమోదు చేశారు. యువతిపై అత్యాచారం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. దాంతో నిందితులను ఈ రోజు కోర్టులో హాజరుపరచనున్నారు.