
హైదరాబాద్: వినాయక చవితి అంటే హైదరాబాద్ సిటీలో టక్కున గుర్తుకు వచ్చేవి రెండే రెండు. ఒకటి ఖైరతాబాద్ వినాయకుడు.. రెండు బాలాపూర్ లడ్డూ వేలం. అయితే కరోనా క్రమంలో ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి ఎత్తు తగ్గించగా.. ఇప్పుడు బాలాపూర్ లడ్డు వేలంపై కూడా ఓ నిర్ణయానికి వచ్చారు కమిటీ నిర్వాహకులు. ఈ సారి బాలాపూర్ లడ్డూ వేలం లేదని ఉత్సవ కమిటీ అధ్యక్షుడు నిరంజన్ రెడ్డి తెలిపారు. ఉదయం, సాయంత్రం పూజారితో మాత్రమే పూజలు నిర్వహిస్తామని, సాధారణ భక్తులు పూజలు చేసేందుకు అవకాశం లేదన్నారు. శనివారం సాయంత్రం 6గంటలకు పూజ ప్రారంభమవుతుందని, నిమజ్జనంపై ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు నిరంజన్ రెడ్డి.