గణేష్ నిమజ్జనం రోజు ఆంక్షలు,సడలింపులు వద్దన్నహైకోర్టు

గణేష్ నిమజ్జనం రోజు ఆంక్షలు,సడలింపులు వద్దన్నహైకోర్టు

హైదరాబాద్ హుస్సేన్‌ సాగర్‌లో గణేష్ నిమజ్జనంపై హైకోర్టు విచారణ జరిపింది. గణేష్ నిమజ్జనంపై నిర్ణయాన్ని చెప్పడానికి వారం రోజుల సమయం కావాలని ప్రభుత్వం కోరింది. నిమజ్జనం నిర్ణయంతో పాటు పండగ సందర్భంగా జనం గుమిగూడకుండా ప్రభుత్వ చర్యలు తెలపాలని హైకోర్టు సూచించింది. గతేడాది ఆంక్షలు, నిబంధనల్లో సడలింపులు ఉండొద్దని కోర్టు అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వినాయక నిమజ్జనంపై విచారణ ఈనెల 18కి కోర్టు వాయిదా వేసింది.