ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్.. రాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ మెట్రో

ఉప్పల్ స్టేడియంలో IPL మ్యాచ్.. రాత్రి 12 గంటల వరకు హైదరాబాద్ మెట్రో

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో బుధవారం రాత్రి SHR Vs LSG ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు భారీగా క్రికెట్ అభిమానులు స్టేడియానికి రానున్నారు. ఐపీఎల్ మ్యాచ్ సందర్బంగా మెట్రో రైల్ టైమింగ్ పొడిగించారు. మెట్రో రైళ్లు బుధవారం అర్ద రాత్రి 12:15 చివరి ట్రైన్ బయలు దేరి 1:10 వరకు చివరి టర్మినల్స్ కు చేరుకుంటుందని మెట్రో అధికారులు తెలిపారు.

ఐపీఎల్ మ్యాచ్ కు వచ్చే అభిమానూలు మెట్రో సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. ఉప్పల్ స్టేడియం, ఎంజీఆర్ ఐ స్టేషన్స్ లో ఎంట్రీ, మిగతా స్టేషన్స్ లో ఎగ్జిట్ మాత్రమే ఉండనుంది. అయితే ఈరోజు కూడా హైద్రాబాద్ లో వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి.. ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణపై సస్పెన్స్ కొనసాగుతోంది. మెట్రో అధికారులు మాత్రం టైం పొడిగింపు ప్రకటించారు.