వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

ప్రపంచ వ్యాప్తంగా నోబెల్ అవార్డుకు ఎంతో గుర్తింపు ఉంది. శాంతి, భౌతికశాస్త్రం, రసాయనశాస్త్రం, వైద్యశాస్త్రం, సాహిత్యంలో అత్యున్నతస్థాయిలో ప్రతిభా పాటవాలు చూపినవారికి, విశేష కృషి సల్పిన వారికి ప్రతి ఏటా నోబెల్ అవార్డుతో గౌరవిస్తుంటారు. ఈ ఏడాది వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి ప్రకటించారు. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకు విలియం జి కెలెన్, సర్ పీటర్ రాట్ క్లిఫ్, గ్రెగ్ ఎల్ సెమెంజాలను నోబెల్ వరించింది. ఆక్సిజన్ ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై వీరు విశేష పరిశోధన చేశారు.