రూ.10 కాయిన్స్​తో నామినేషన్ ఫీజు!

రూ.10 కాయిన్స్​తో నామినేషన్ ఫీజు!
  •  గంపలో రూ.25 వేల చిల్లరతో వచ్చి 
  • నామినేషన్​ వేసిన సివిల్ ​ఇంజినీర్​ 

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లోక్ సభ అభ్యర్థిగా పేరాల మానసారెడ్డి వినూత్న రీతిలో మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ ఫీజుగా చెల్లించాల్సిన రూ.25 వేలను రూ.10 కాయిన్స్​తో చెల్లించారు. ఈ చిల్లర కాయిన్స్ ను ఓ బుట్టలో వేసుకుని నెత్తిన ఎత్తుకుని కలెక్టరేట్​కు చేరుకోవడాన్ని వాహనదారులు, పోలీసులు, కలెక్టరేట్ సిబ్బంది ఆసక్తిగా చూశారు.

 కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన మానస సివిల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. కొన్నాళ్లుగా గర్ల్స్ ఎడ్యుకేషన్​పై వాయిస్ ఫర్ గర్ల్స్ అనే ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థతో కలిసి పని చేస్తున్నారు. మార్పు కోసం మానస అనే ట్యాగ్ లైన్ తో విద్య, వైద్యం, ఉపాధికి సంబంధించి 10 అంశాలతో కూడిన ఎజెండాను కూడా ఈ ఎన్నికల సందర్భంగా ప్రకటించారు. తనను గెలిపిస్తే పేపర్లకే పరిమితమైన అభివృద్ధిని కళ్ల ముందుంచుతానని వెల్లడించారు.