సియోల్: అణ్వాయుధాలు, క్షిపణుల ప్రయోగాలపై ఇప్పటి దాకా విధించుకున్న సొంత నియంత్రణకు ఇక స్వస్తి పలుకుతున్నట్లు నార్త్ కొరియా లీడర్కిమ్ జోంగ్ ఉన్ బుధవారం ప్రకటించారు. త్వరలోనే కొత్త వ్యూహాత్మక ఆయుధాన్ని పరీక్షిస్తామని స్పష్టం చేశారు. అమెరికాతో చర్చల కోసం కొంతకాలంగా అణ్వాయుధాలను పరీక్షించడంపై స్వీయ నియంత్రణ పాటిస్తున్నట్లు ఆయన చెప్పారు. అమెరికా ప్రెసి డెంట్ డొనాల్డ్ ట్రంప్ తో ఇప్పటికే మూడుసార్లు భేటీ అయినా చర్చల్లో చెప్పుకోదగ్గ పురోగతి కనిపించడంలేదని కిమ్ చెప్పారు. అమెరికా తన సొంత ప్రయోజనాల కోసమే చర్చలకు అడ్డుపుల్లలు వేస్తోందని కిమ్ ఆరోపించారు. ఈ క్రమంలో అణ్వాయుధ పరీక్షలను ఆపేయడంలో ఎలాంటి అర్థం లేదని చెప్పారు.

