పండు ముస‌ల‌వ్వ‌ను జేసీబీతో రోడ్డు పక్కన పడేసిన్రు

పండు ముస‌ల‌వ్వ‌ను జేసీబీతో రోడ్డు పక్కన పడేసిన్రు

నాగర్ కర్నూల్, వెలుగు: తొమ్మిది పదుల ఓ పండుటాకును జేసీబీ ముందుండే బకెట్‌‌లో కూర్చోబెట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్డుపక్కన వదిలేశారు. రాత్రి కురిసిన వర్షానికి తడుస్తూ అక్కడే పడుకున్న వృద్ధురాలి దీనస్థితిని చూసిన స్థానికులు పంచాయతీకి సమాచారం ఇవ్వగా..గురువారం ఉదయం వారు తాత్కాలికంగా ఆశ్రయం కల్పించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో జరిగిందీ ఘటన. పెద్దకొత్తపల్లిలో భిక్షాటన చేస్తూ గడిపే వృద్ధురాలిని గుర్తు తెలియని వ్యక్తులు జేసీబీలో తెచ్చి వదిలి వెళ్లారని ముస‌ల‌వ్వ చెప్పింది. రాత్రి వర్షం కురవడంతో అక్కడే ఉన్న ఓ కవర్‌‌‌‌‌‌‌‌ను కప్పుకొని గడిపానంది. గ్రామంలో అడుక్కునే వృద్ధురాలిని ఊరి బయట దింపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందా.. అన్నది స్థానికంగా చర్చనీయాంశమైంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి