హ్యాపీడేస్ చిత్రంతో పదహారేళ్ల క్రితం టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన వరుణ్ సందేశ్(Varun Sandesh)..తర్వాత కెరీర్లో సక్సెస్లు అందుకోలేక పోయాడు. ఇటీవల మైఖేల్ మూవీతో తనలోని కొత్త నటుడ్ని పరిచయం చేసిన వరుణ్..ప్రస్తుతం డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాల్లో నటిస్తున్నాడు.
ప్రస్తుతం వరుణ్ చిత్రం చూడరా (Chitramchudara) అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ ఆడియన్స్ లో ఆసక్తి కలిగించింది. వరుణ్ సందేశ్ తో పాటు, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ , రవిబాబు నటిస్తున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ మేరకు స్ట్రీమింగ్ డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా మే 9న ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్కు రానున్నట్లు పోస్ట్ చేసింది. "ఈవారం ఓటీటీలో ఈ చిత్రం చూడరా..‘చిత్రం చూడారా’ స్ట్రీమింగ్ కానుంది” అని ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
Ee varaniki e #ChitramChoodara 😉
— ETV Win (@etvwin) May 5, 2024
ChitramChoodara premieres may 9@itsvarunsandesh
@rn_harshavardhan
@sheetalbhatttt
@aditigauthamofficial
@yoursdhanraj
@ravibabuofficial pic.twitter.com/oaTzjDdY5u
క్రైమ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డై హార్డ్ ఫ్యాన్గా కనిపిస్తున్నాడు. ఇందులో వరుణ్ సందేశ్ చేయబోయే క్రైమ్లో, ధనరాజ్, కాశీ విశ్వనాథ్ సిద్దపడినట్లు.టీజర్, ట్రైలర్లో చూపించారు మేకర్స్.
ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో రవిబాబు పోలీస్ పాత్రలో నెగిటివ్ షెడ్ పాత్రలో నటిస్తున్నాడు.అయితే ముందుగా ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేయాలని భావించిన కుదర్లేదు.దీంతో నేరుగా మే 9న ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు రానుంది. మరి చాలా రోజుల తర్వాత హీరోగా ఎంట్రీ ఇస్తున్న వరుణ్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.