కరోనా, ఒమిక్రాన్ కేసులు క్రమక్రమంగా విస్తరిస్తున్నాయి. ఓ పక్క కరోనా కేసులు.. మరోపక్క ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దాంతో ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. కొన్ని రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ, వీకెండ్ కర్ఫ్యూలు అమలు చేస్తున్నారు. అయినా కూడా కరోనా, ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా పార్లమెంట్ లో కరోనా కేసులు బయటపడ్డాయి. పార్లమెంట్ లో పనిచేసే 402 మందికి కరోనా సోకింది. మొత్తం 1,409 మంది సిబ్బందికి పరీక్షలు నిర్వహిస్తే.. వారిలో 402 మంది స్టాఫ్కి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు అధికారులు ప్రకటించారు. పాజిటివ్ బారినపడిన వారిని సరైన ప్రికాషన్స్ తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. పాజిటివ్ వచ్చిన వారిలో 200 మంది లోక్సభ సిబ్బంది ఉంటే.. 69 మంది రాజ్యసభ సిబ్బంది ఉన్నారు. మిగతా 133 మంది సిబ్బంది ఇతర స్టాఫ్గా అధికారులు గుర్తించారు. పాజిటివ్ వచ్చిన వారితో పాటు.. కాంటాక్ట్లను ట్రేస్ చేసి హొం ఐసోలేషన్కు తరలించారు. కరోనా వ్యాప్తితో కార్యాలయాలు 50 శాతం కెపాసిటీతో రన్ చేయాలని కేంద్రప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ఫిబ్రవరి 1నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నిర్వహించాలని ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు సిబ్బందికి కరోనా సోకడంతో సమావేశాలపై సందిగ్ధత నెలకొంది.
పార్లమెంట్ లో కరోనా కలకలం
- దేశం
- January 9, 2022
లేటెస్ట్
- పోలీసుల అదుపులో బీఆర్ఎస్ నేత క్రిశాంక్
- IPL 2024: వరల్డ్ కప్కు పక్కన పెట్టినా అతడు మా నెం.1 ప్లేయర్: రాహుల్పై LSG ఎమోషనల్ పోస్ట్
- Siddharth Roy OTT Official: సిద్ధార్థ్ రాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..ఈ బోల్డ్ రొమాంటిక్ స్ట్రీమింగ్ వివరాలివే
- కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను తయారు చేసిన : జానారెడ్డి
- రసభాసగా మారిన.. మంత్రి కొండా సురేఖ క్యాంపు కార్యాలయం
- SRH vs RR: 30వేల టికెట్స్ 5 నిమిషాల్లో సోల్డ్ ఔట్.. జోరుగా బ్లాక్ దందా.. ఫ్యాన్స్ ఫైర్
- రికార్డు స్థాయిలో GST వసూళ్లు
- Shalini-Ajith Kumar: అజిత్కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన భార్య షాలిని..ప్రేమతో ఇండియాని చుట్టేస్తాడేమో!
- లోక్సభ ఎన్నికలకు .. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినం : వికాస్రాజ్
- దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు..
Most Read News
- RCB: బౌలింగ్ కష్టాలు తీరినట్టే! జూనియర్ బుమ్రాను సిద్ధం చేస్తున్న ఆర్సీబీ
- Bird Flu: విజృంభిస్తున్న బర్డ్ ఫ్లూ.. తినవలసిన ఆహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- Summer trip: తెలంగాణ ఊటీ ఎక్కడుందో తెలుసా...
- 12 ఏళ్ల తరువాత వృషభ రాశిలోకి బృహస్పతి.. ఏరాశి వారికి ఎలా ఉందంటే..
- మీ కోసం : మే 1 నుంచి ఈ బ్యాంకుల్లో రూల్స్ మారాయి..
- సాంబార్ ఎక్కడ పుట్టింది.. మొదట ఎవరు తయారు చేశారో తెలుసా
- IPL 2024: యువ బౌలర్ ఓవర్ యాక్షన్.. నిషేధం విధించిన క్రమశిక్షణా కమిటీ
- ఇస్రోలో ఉద్యోగాలు, జీతం రూ.56వేలు..అప్లయ్ చేసుకోండిలా
- టీ20 వరల్డ్ కప్.. ఆఫ్ఘనిస్తాన్ టీమ్ ఇదే
- T20 World Cup 2024: ఆర్చర్ రీ ఎంట్రీ.. వరల్డ్ కప్ స్క్వాడ్ను ప్రకటించిన ఇంగ్లాండ్