తమిళనాడు విరుద్ నగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ప్రయివేటు క్వారీలో పనులు కొనసాగుతుండగా.. ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
బాధితులను వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు. అవియూర్ సమీపంలోని ఉప్పిలి కుండ దగ్గర ఈ ఘటన జరిగింది. వెంటనే, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.