క్వారీలో భారీ పేలుడు.. ముగ్గురు స్పాట్ డెడ్

క్వారీలో  భారీ పేలుడు.. ముగ్గురు స్పాట్ డెడ్

తమిళనాడు విరుద్ నగర్ జిల్లాలో భారీ పేలుడు సంభవించింది. ఓ ప్రయివేటు క్వారీలో పనులు కొనసాగుతుండగా.. ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు.  మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.

బాధితులను వెంటనే స్థానిక హాస్పిటల్ కు తరలించారు.  అవియూర్ సమీపంలోని ఉప్పిలి కుండ దగ్గర ఈ ఘటన జరిగింది. వెంటనే, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏం జరిగిందనేదానిపై ఆరా తీస్తున్నారు.