రైతుల నిరసనలు ఇంకా ముగియలేదు

రైతుల నిరసనలు ఇంకా ముగియలేదు

న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో హింసకు పాల్పడిన వారిని కచ్చితంగా శిక్షించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆ ఘటన దురదృష్టకరమని.. అయితే దీంతో రైతుల నిరసన ముగిసినట్లు భావించొద్దన్నారు. అన్నదాతలు నిరసనలకు శాంతియుతంగా మద్దతు తెలిపాలన్నారు. ‘జనవరి 26న జరిగిన ఘటన చాలా దురదృష్టకరం. అయితే దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షించాలి. ఈ ఘటన వల్ల నిరసనలు ఏం ముగిసిపోవు. అన్నదాతల నిరసనలకు శాంతియుతంగా నిరసన తెలిపాలి. రైతులు అసంతృప్తితో ఉంటే అందరం సంతోషంగా ఎలా ఉండగలం?’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.