
డెహ్రాడూన్: ఉత్తరాఖాండ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న బస్సు రుద్రప్రయాగ జిల్లాలోని బద్రీనాథ్ హైవేపై ఘోల్తీర్ సమీపంలో అలకనంద నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో 10 మంది ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటన స్థలానికి చేరుకుని రెస్య్కూ ఆపరేషన్ చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఘటన స్థలంలో ముమ్మరంగా సహయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా బద్రీనాథ్ హైవేపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో అధికారులు ఆ రూట్ను తాత్కలికంగా క్లోజ్ చేశారు.
ఈ ఘటనపై గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే మీడియాతో మాట్లాడుతూ.. రుద్రప్రయాగ్ జిల్లాలోని ఘోల్తీర్లోని అలక్నంద నదిలో 18 సీట్ల బస్సు పడిపోవడంతో ఒకరు మరణించగా, ఏడుగురు గాయపడ్డారని తెలిపారు. ఘటన స్థలంలో ఎస్డీఆర్ఎఫ్, పోలీసులు, పరిపాలన బృందాలు సహయక చర్యలు కొనసాగిస్తున్నాయన్నారు.
A tragic accident occurred in #Uttarakhand when an 18-seater bus plunged into the Alaknanda River near Gholthir in Rudraprayag district. The incident resulted in one fatality, with seven others injured and several missing. #BusAccident pic.twitter.com/h79Hk6AKgT
— Madhuri Adnal (@madhuriadnal) June 26, 2025