మోసపోతున్నది హై క్వాలిఫైడ్స్​..సైబర్ ఫ్రాడ్ రోజుకు రూ.34 కోట్లు

మోసపోతున్నది హై క్వాలిఫైడ్స్​..సైబర్ ఫ్రాడ్ రోజుకు రూ.34 కోట్లు
  • జాయింట్ సీపీ రంగనాథ్ వెల్లడి

హైదరాబాద్​: టెన్త్​ఫెయిల్​ అయినవాళ్లే సైబర్ మోసాలకు పాల్పడుతున్నారని, కానీ మోసపోతున్నది మాత్రం హైలీ క్వాలిఫైడ్ వాళ్లు అని జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు.  రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అయ్యాయని  చెప్పారు. రోజుకు కోటి రూపాయల చొప్పున సైబర్ నేరగాళ్లు దోచుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రూ. 34 కోట్లను  సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారని తెలిపారు. రోజుకు సగటున 15 కేసులు నమోదు అవుతున్నాయన్నారు. ఇవి   నమోదైన కేసులు మాత్రమేనని, బయట పడనివి మరిన్ని ఉంటాయన్నారు.

సైబర్ చీటింగ్ కి గురైతే వెంటనే 2-3 గంటల్లో ఫిర్యాదు చేస్తే ఎదైనా ఫలితం ఉంటుందని రంగనాథ్ తెలిపారు. అధిక లాభాలకు అట్రాక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకుంటున్న వారే ఎక్కువ అని అన్నారు. సైబర్ నేరగాళ్ల మాయలో పడుతున్న వారిలో చదువుకున్న యువత  ఎక్కువ  అని చెప్పారు. తెలిపారు. సైబర్ క్రైమ్ లో కోల్పోయిన డబ్బును వెనక్కి తీసుకు రావడం కష్టతరమని చెప్పారు.

 సైబర్ నేరాల పెరుగుతున్న క్రమంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. సినీ సెలబ్రిటీల ద్వారా కూడా అవేర్నెస్ కల్పిస్తామన్నారు.