బ్రస్సెల్స్: బెల్జియం ప్రిన్స్ జోచిమ్ కు కరోనా కన్ఫామ్ అయింది. స్పెయిన్లో ఒక పార్టీకి హాజరైన రెండ్రోజుల తర్వాత ఆయనకు కరోనా సోకినట్లు ఆ దేశ రాయల్ ఫ్యామిలీ ఆదివారం ప్రకటించింది. ఈ నెల 26 న ఇంటర్న్షిప్ కోసం స్పెయిన్ కు వెళ్లిన ప్రిన్స్ జోచిమ్.. 28న కార్డోబాలో జరిగిన ఓ పార్టీకి అటెండ్ అయ్యారని, ఆ పార్టీలో 27 మంది ఉన్నట్లు వెల్లడించింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన స్పానిష్ పోలీసులు పార్టీకి హాజరైన వారందరినీ గుర్తించి టెస్టులు నిర్వహిస్తామన్నారు. లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసినట్లు రుజువైతే ఒక్కొక్కరికి 10 వేల యూరోలు(రూ.8 లక్షలు) పెనాల్టీ విధిస్తామన్నారు. పార్టీలో ప్రిన్స్ జోచిమ్ తో పాటు, ప్రిన్సెస్ ఆస్ట్రిడ్ చిన్న కొడుకు, కింగ్ ఫిలిప్ సోదరుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. స్పెయిన్ లో 15 మంది కన్నా ఎక్కువ గుమికూడవద్దన్న లాక్డౌన్ రూల్స్ అమల్లో ఉన్నదని గుర్తుచేశారు. ఆ దేశంలో ఇప్పటికే 2,39,000 మంది కరోనా బారిన పడగా.. 27,125 మంది మరణించారు. 1,50,000 మంది కోలుకున్నారు.
లాక్డౌన్ పట్టించుకోకుండా పార్టీకి.. బెల్జియం ప్రిన్స్ కి కరోనా
- విదేశం
- May 31, 2020
లేటెస్ట్
- LSG vs RR: లక్నోపై ఘన విజయం.. ప్లే ఆఫ్ కు చేరువలో రాజస్థాన్ రాయల్స్
- Cyber Crime : ముంబై సీబీఐ పేరుతో.. రూ.35 లక్షలు కొట్టేసిన కేటుగాళ్లు
- తెలంగాణ కోసం పోరాడిన యోధుడు కాక: ఎంపి అభ్యర్థి వంశీకృష్ణ
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- JEE అడ్వాన్స్డ్ 2024 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. అప్లయ్ చేసుకోండిలా
- చంద్రబాబు హయాంలో బడ్జెట్ తీరు.. ఉపాధి కల్పన..
- IPL 2024: మెరిసిన రాహుల్, దీపక్ హుడా.. రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
- 95 మంది పిల్లల అక్రమరవాణా..రక్షించిన యూపీచైల్డ్ కమిషన్
- చంద్రబాబు సూపర్ 6హామీలకు అయ్యే ఖర్చు.. సాధ్యాసాధ్యాలు
- భారీగా విదేశీ మద్యం పట్టివేత
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- పీజీ చేసిన వారికి గుడ్న్యూస్..
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- హైదరాబాద్ ఐటీ కారిడార్లో నీటి ఎద్దడి.. పడిపోయిన గ్రౌండ్ వాటర్
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- హైదరాబాద్ లో లైట్ బీర్ల కొరత.. ఎక్కడ అడిగినా నో స్టాక్ అంటున్న సిబ్బంది