రైతు దగ్గర రూ.40 వేలు లంచం : ACBకి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి

రైతు దగ్గర రూ.40 వేలు లంచం : ACBకి చిక్కిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగి

దుండిగల్  : మరో అవినీతి చేప ACBకి చిక్కింది. దుండిగల్ ఎమ్మార్వో ఆఫీసులో రైతు దగ్గర రూ.40 వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి నరేందర్ రెడ్డి. శ్రావణ్ కుమార్ అనే రైతు భూమిని ఆన్ లైన్ చేయడం కోసం రూ. 40 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న ACB అధికారులు సోమవారం నరేందర్ రెడ్డిని లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

నరేందర్ రెడ్డి కార్యాలయంతో పాటు ఇళ్లపై  ACB అధికారులు సోదాలు చేపట్టారు. ప్రస్తుతం సోదాలు కొనసాగుతుండగా.. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.