అమెరికాలో కాల్పులు.. న‌లుగురి మృతి

అమెరికాలో కాల్పులు.. న‌లుగురి మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో కాల్పులు జరిగాయి. అక్కడి ఓ నౌకాశ్ర‌యంలో సౌదీ ఎయిర్‌ఫోర్స్ ట్రైనర్ కాల్పులకు పాల్ప‌డడంతో నలుగురు చనిపోయారు. వెంటనే అలర్టైన పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని హ‌త‌మార్చారు. నేవ‌ల్ ఎయిర్‌స్టేష‌న్ పెన్స‌కోలాలో ఈ ఘటన జరిగింది. ఈ కాల్పుల్లో మరో  ఎనిమిది మంది గాయ‌ప‌డ్డారని అధికారులు చెప్పారు.

కాల్పులపై స్పందించారు అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ ఘటనను వ్య‌క్తిగ‌తంగా ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాదుల హస్తం ఉందా? అన్న విషయంపై అధికారులు దర్యాప్తు జరుపుతున్నట్లు చెప్పారు. కొందరు సౌదీ పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.