IPL 2025 Final: ఒక్క రోజులో ఇంగ్లాండ్ టూ ఇండియా: ఫైనల్ మ్యాచ్‌కు జట్టులో చేరిన RCB ఓపెనర్

IPL 2025 Final: ఒక్క రోజులో ఇంగ్లాండ్ టూ ఇండియా: ఫైనల్ మ్యాచ్‌కు జట్టులో చేరిన RCB ఓపెనర్

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కు ముందు బెంగళూరు జట్టుకు గుడ్ న్యూస్ అందింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ పిల్ సాల్ట్ ఐపీఎల్ ఫైనల్ ఆడడం ఖాయమైంది. కొన్ని గంటల క్రితం ఈ ఇంగ్లాండ్ బ్యాటర్ ఆడతాడా లేదా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే సాల్ట్ మజాగా అహ్మదాబాద్ చేరుకోవడంతో ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్నట్టు కన్ఫర్మ్ అయింది.

సాల్ట్ భార్య ప్రసవించడంతో అతను తన బిడ్డను చూసుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్ళాడు. ఆ తర్వాత ఐపీఎల్ ఫైనల్ కోసం వెంటనే ఇండియాకు రిటర్న్ అవ్వడం విశేషం. ఇంగ్లాండ్ నుంచి ఈ ఆర్సీబీ ఓపెనర్ మంగళవారం (జూన్ 3) ఉదయం అహ్మదాబాద్‌కు తిరిగి వచ్చినట్టు తెలుస్తుంది. ఒక్క రోజులోనే సాల్ట్ ఇంగ్లాండ్ నుంచి ఇండియాకు తిరిగి రావడంతో అతనికి బెంగళూరు జట్టుపై ఎంత విధేయతగా ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. విరాట్ కోహ్లీతో సాల్ట్ ఇన్నింగ్స్ ను ఆరంభించనున్నాడు. 

ఈ సీజన్ లో సాల్ట్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ముఖ్యంగా చివరి మూడు మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి జోరు మీదున్నాడు. ఈ ఇంగ్లాండ్ ఓపెనర్ అందించే మెరుపు ఆరంభాలు ఆర్సీబీ జట్టులో కీలక పాత్ర పోషించాయి. ఫైనల్లో కూడా సాల్ట్ మరో మ్యాజికల్ ఇన్నింగ్స్ ఆడతాడని ఆర్సీబీ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సీజన్ లో సాల్ట్ ఇప్పటివరకు 175 స్ట్రైక్ రేట్ తో 387 పరుగులు చేశాడు. సాల్ట్ తో పాటు ఈ మ్యాచ్ లో ఆసీస్ పవర్ హిట్టర్ టిమ్ డేవిడ్ కూడా గాయం నుంచి కోలుకొని ప్లేయింగ్ 11 లో ఆడడం ఖాయమైంది. 

►ALSO READ | RCB Vs PBKS IPL Final : అందరి చూపు అహ్మదాబాద్ ఆకాశం వైపే.. వర్షం పడే ఛాన్స్ ఎంత..?

ఎవరు గెలిచినా వారికి ఇదే తొలి ఐపీఎల్ టైటిల్. దీంతో ఈ సారి రెండు జట్లు ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాయి. క్వాలిఫయర్ 1 లో పంజాబ్ ను చిత్తు చేసి ఆర్సీబీ ఫైనల్ చేరుకుంది. ఆదివారం (జూన్ 1) జరిగిన క్వాలిఫయర్ 2 మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించి పంజాబ్ కింగ్స్ ఫైనల్లో అడుగుపెట్టింది.