కమర్షియల్ వెహికల్ కంపెనీ పియోగియో అపె హెచ్టీ రేంజ్ లో మూడు త్రీవీలర్లను ఇండియా మార్కెట్లో లాంచ్ చేసింది. ఇందులో పెట్రోల్తోపాటు సీఎన్జీ, కమర్షియల్ వేరియంట్లు ఉన్నాయి. ధరలు రూ.2.25 లక్షల నుంచి రూ.2.56 లక్షల వరకు ఉన్నాయి. తొలిసారిగా వీటిలో 300 సీసీ ఇంజన్ను ఉపయోగించామని కంపెనీ ప్రకటించింది. త్రీవీలర్లో పెట్రోల్ వేరియంట్ను డెవలప్ చేసిన కంపెనీ తమది ఒకటేనని, దీనివల్ల డ్రైవర్కు ఎంతో డబ్బు ఆదా అవుతుందని తెలిపింది.