
ఎన్డీఆర్ఎఫ్కు ట్రాన్స్ ఫర్ చేయాలని సూచించలేం
పీఎం కేర్స్ ఉద్దేశం వేరు: సుప్రీం
కేంద్రం భావిస్తే బదిలీ చేసుకోవచ్చు
కొత్తడిజాస్టర్ రిలీఫ్ ప్లాన్
అవసరం లేదని కామెంట్
న్యూఢిల్లీ: ‘పీఎం కేర్స్ ఫండ్’ నిధులను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్ఎఫ్ న్డీ )కు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. పీఎం కేర్స్కు విరాళాల రూపంలో ఫండ్స్ వచ్చాయని, వాటిని సేకరించిన ఉద్దేశం వేరని చెప్పింది. ఎన్డీఆర్ఎఫ్ న్డీకు డబ్బు బదిలీ చేయాలని సర్కారు భావిస్తే.. ట్రాన్స్ ఫర్ చేసుకోవచ్చని తెలిపింది. సెంటర్ ఫర్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనే ఎన్ఓజీ వేసినపిటిషన్ ను జస్టిస్ అశోక్ భూషణ్ , జస్టిస్ ఆర్.సుభాష్ రెడ్డి, జస్టిస్ ఎంఆర్ షాలతో కూడిన బెంచ్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. అంతకుముందు కేంద్ర హోంశాఖ..పీఎం కేర్స్ అనేది పబ్లిక్ చారిటీ ట్రస్టు లాంటిదని, ఎవరైనా దానికి స్వచ్ఛందంగా విరాళం ఇవ్వొచ్చని కోర్టుకు విన్నవించింది.
మేం సూచించలేం
పీఎం కేర్స్ కు వచ్చిన నిధులను ఎన్డీఆర్ ఎఫ్ కు బదిలీ చేయాలని పిటిషనర్ కోరారు. డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ రూల్స్ ను పీఎం కేర్స్ ఫండ్ ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. స్పందించిన బెంచ్..పీఎంకేర్స్ నిధులను ఎన్డీఆర్ ఎఫ్ కు బదిలీ చేయాలని కేంద్రానికి తాము సూచించలేమని స్పష్టం చేసింది. కొత్త డిజాస్టర్ రిలీఫ్ ప్లాన్ అవసరం లేదని, నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద సర్కారు ఇప్పటికే ఏర్పాటు చేసినది సరిపోతుందని తీర్పునిచ్చింది. పిటిషన్ ను డిస్మిస్ చేసింది. పీఎం కేర్స్ ఫండ్ ను మార్చి 28న ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సహాయక చర్యల కోసం ఈ నిధిని క్రియేట్ చేసింది.
పీఎం కేర్స్, పీఎంఎన్ఆర్ఎఫ్ మధ్య తేడాలివీ
ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ , రిలీఫ్ ఇన్ ఎమర్జెన్సీ సిచుయేషన్స్ (పీఎం కేర్స్), ప్రధాన మంత్రి నేషనల్ రిలీఫ్ ఫండ్ (పీఎంఎన్ఆర్ఎఫ్)..రెండింటికీ పీఎం చైర్ పర్సన్ గాఉంటారు. పీఎం కేర్స్ కు కార్పొరేట్ విరాళాలు ఇవ్వొచ్చు. కానీ ఈ సౌకర్యం పీఎమ్ఎన్ఆర్ఎఫ్కు లేదా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు అందుబాటులో లేదు. గత సీఎస్ఆర్ మార్గదర్శకాల్లో కూడా ప్రభుత్వ పథకాలకు కార్పొరేట్ విరాళాలను ఉపయోగించడాన్ని రిస్ట్రిక్ట్ చేశారు. పీఎం కేర్స్ ఫండ్..ఆడిట్ కు లోబడి ఉండదు. కానీ పీఎంఎన్ఆర్ఎఫ్ ఖర్చులుమాత్రం ఇండిపెండెంట్ ఆడిటర్ ఆడిట్ చేస్తారు. తర్వాత పీఎం కేర్స్ పై తీవ్ర వ్యతిరేకత రావడంతో.. ప్రభుత్వం ఆడిటర్ ను నియమించింది. పీఎం కేర్స్ ఫండ్ బోర్డ్ ఆఫ్ ట్రీస్టులుగా ముగ్గురిని ప్రధాని నియమించవచ్చు. ప్రస్తుతం డిఫెన్స్, హోం, ఫైనాన్స్ మినిస్టర్లు..ఎక్స్ అఫీషియోట్రస్టీలుగా ఉన్నారు. కానీ పీఎంఎన్ఆర్ఎఫ్ లో మాత్రం అంతా ఓ కమిటీ చూసుకుంటుంది.