ర్యాలీకి అన్ని రూల్స్ పాటిస్తా

ర్యాలీకి అన్ని రూల్స్ పాటిస్తా

హైదరాబాద్ కు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ నుంచి  నేరుగా సికింద్రాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్ దగ్గర బీజేపీ నేతలు నడ్డాకు ఘన స్వాగతం పలికారు.  సంజయ్ అరెస్ట్ కు నిరసనగా సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ప్యారడైజ్ సర్కిల్ వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ ర్యాలీలో పాల్గొననున్నారు. కాసేపటి క్రితమే బీజేపీ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అయితే కరోనా రూల్స్ పాటించాలని సూచించారు. ర్యాలీలో 40 మంది మాత్రమే పాల్గొనాలని చెప్పారు.

ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్ దగ్గర మాట్లాడిన జేపీ నడ్డా.. ప్రజాస్వామ్య పద్దతిలో సికింద్రాబాద్ గాంధీ విగ్రహం నుంచి ర్యాలీ చేస్తానన్నారు.  తనను జాయింట్ సీపీ కార్తికేయ కలిశారని.. ర్యాలీకి కరోనా రూల్స్ పాటించాలని చెప్పారన్నారు. తాను అన్ని రూల్స్ పాటిస్తా కానీ.. ఏర్పాటు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర సర్కార్ దే  అన్నారు నడ్డా. అయితే.. సీపీ ఏర్పాట్లపై అసమర్థత వ్యక్తం చేశారని... ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దామన్నారు.