పంజాగుట్ట, వెలుగు: నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన ఓ వృద్ధుడు తప్పిపోగా పంజాగుట్ట పోలీసులు అతడిని కొడుకుకి అప్పగించారు. పంజాగుట్ట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాలకు చెందిన వెంకటరెడ్డి (70) హార్ట్ పేషెంట్... గురువారం ఓపీలో పేరు నమోదు చేయడానికి కుమారుడు సత్యనారాయణ రెడ్డి వెళ్లాడు.
ఇంతలో గేటు బయటకు వెళ్లిన వృద్ధుడు దారి తెలియక తిరుగుతుండడంతో పోలీసులు అతడిని పంజాగుట్ట పోలీస్స్టేషన్ కు తీసుకెళ్లారు. సెక్యూరిటీ కార్యాలయం వద్ద సీసీ కెమెరాలు పరిశీలించగా పోలీసులు వృద్ధుడిని తీసుకెళ్లినట్లు ఉండగా కొడుకు పోలీసు స్టేషన్ కి వెళ్లి తండ్రికి సంబంధించిన ఆధార్ కార్డు చూపించడంతో ఏఎస్ఐ చలమయ్య వెంకట రెడ్డిని కుమారుడికి అప్పగించారు.