ఎమ్మెల్యే రాజసింగ్కు మరోసారి పోలీసుల నోటీసులు

ఎమ్మెల్యే రాజసింగ్కు మరోసారి పోలీసుల నోటీసులు

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 29న ముంబైలోని దాదర్లో జరిగిన ఓ ర్యాలీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్టు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. హైకోర్టు విధించిన షరతులను రాజాసింగ్ ఉల్లంఘించారని.. రెండు రోజుల్లో వీటిపై సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు. ఈ నోటీసులపై రాజాసింగ్ స్పందించారు. రాష్ట్రాన్ని ఎనిమిదో నిజాం పాలిస్తున్నారని విమర్శించారు. నిజాం పాలనకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని.. పోలీసులు జైలుకు పంపినా భయపడేది లేదని స్పష్టం చేశారు. ధర్మం కోసం చావడానికైనా సిద్ధమన్నారు. గోహత్య, మతమార్పిడులు, లవ్ జీహాద్పై చట్టం తీసుకురావాలని డిమాండ్ చేయడం మతవిద్వేషాలను రెచ్చగొట్టడమా అని ప్రశ్నించారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడితే మంగళహట్ పోలీసులు నోటీసులు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు.