ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదు: పొంగులేటి సుధాకర్ రెడ్డి

ప్రధానిని విమర్శించే స్థాయి కేటీఆర్ ది కాదు: పొంగులేటి సుధాకర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీని మంత్రి కేటీఆర్ విమర్శించడంపై బీజేపీ నేత, తమిళనాడు కో ఇన్ చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కేటీఆర్ ది ప్రధానిని విమర్శించే స్థాయి కాదని మంగళవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.  ఇచ్చిన మాట ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీని, పసుపు బోర్డు ఏర్పాటు చేయనున్నట్లు మోదీ ప్రకటించారని తెలిపారు. ఆయన ప్రకటనపై రాష్ర్ట ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

బీఆర్ఎస్ నేతలు 9 ఏండ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయని, బీజేపీకి పట్టం కట్టేందుకు రాష్ర్ట ప్రజలు రెడీ అయ్యారని తెలిపారు. కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ర్ట ప్రభుత్వం దారి మళ్లిస్తున్నదని ఆరోపించారు. ప్రధాని మీటింగ్​లకు పబ్లిక్ స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేశారని తెలిపారు.