టాలీవుడ్ హీరోయిన్ పూనమ్ కౌర్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది. తాజాగా పూనమ్.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ఈటల రాజేందర్తో భేటీ అయ్యారు. ఈటలతో పాటు ఆమె సతీమణి జమునతో కూడా ఆమె సమావేశం అయ్యారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలుపు సాధించిన ఈటలను పూనమ్ సత్కరించారు. కాషాయం రంగు కండువా కప్పి సత్కరించారు. అనంతరం ఏక్ ఓంకార్ అనే మత పరమైన జ్ఞాపికను కూడా పూనమ్ ఈటల దంపతులకు అందజేశారు.
#GuruNanakJayanti2021 pic.twitter.com/iXqERxcWag
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) November 19, 2021
ఈ భేటీ సందర్భంగా ఇరువురు శాంతి కపోతాలను గాల్లోకి ఎగురవేశారు. దీనిపై పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో స్పందించారు. రైతు చట్టాలను కేంద్రం రద్దు చేసిందని విన్నాం. స్వేచ్ఛా భావనలకు నిదర్శనంగా పావురాళ్లను ఎగురవేయడానికి ఇది సరైన సమయం. పావురాళ్లు శాంతికి చిహ్నాలు అని పేర్కొన్నారు. ఆత్మగౌరవం, దయ, అంకితభావం ఉన్న వ్యక్తులను గురునానక్ ఎప్పుడూ దీవిస్తాడని పూనమ్ ఈ సందర్భంగా తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతకుముందు ఆమె ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై కూడా ట్వీట్ చేశారు. రాజకీయ అజెండా కోసం వ్యక్తిగత దాడులకు ఎవరూ అర్హులు కాదని పూనమ్ ట్విట్టర్లో పేర్కొన్నారు.