తెలంగాణపై ప్రధాని మోడీ ట్వీట్

తెలంగాణపై ప్రధాని మోడీ ట్వీట్
  • బీజేపీ పథకాలతో అణగారిన వర్గాలకు మేలు
  • ప్రధాని మోడీ ట్వీట్

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని.. మరికాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పరేడ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతున్నానంటూ ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు, ప్రారంభించిన సంక్షేమ పథకాలు సమాజంలోని అన్ని వర్గాలు లబ్ది పొందాయని మోడీ పేర్కొన్నారు. కేంద్ర పథకాలతో రైతులు, యువకులు, మహిళలు ముఖ్యంగా అణగారిన వర్గాలకు మేలు జరిగిందని ప్రధాని మోడీ తెలిపారు.