తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుండడం.. కరోనా వైరస్‌ వ్యాప్తి కూడా పెరుగుతుండడంతో, పదవ తరగతి పరీక్షలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఈ నెల 23 నుండి 30 వరకు జరగాల్సిన పరీక్షలు, హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడగా.. వీటిని ఈ నెల 31 నుండి ఏప్రిల్‌ 6 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కొనసాగుతుండడంతో రేపటి(మంగళవారం) నుండి జరగాల్సిన పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు డైరెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. వాయిదా ప‌డిన 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష‌ల‌తో పాటు అన్ని ఇత‌ర ప‌రీక్ష‌ల రీ షెడ్యూల్ తేదీల‌ను త‌ర్వ‌లోనే ప్రకటిస్తామన్నారు.