సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి

సమ్మర్ క్యాంపులో మంత్రి సందడి

కొల్లాపూర్,వెలుగు: విద్యార్థులకు చదువుతోపాటు వ్యాయామం, ఆటపాటలు కూడా ఎంతో ముఖ్యమని రాష్ట్ర ఎక్సైజ్, టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఉదయం కొల్లాపూర్ లోని స్థానిక మినీ స్టేడియంలో రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో విద్యార్థులతో ఆయన గేమ్స్ ఆడి సందడి చేశారు. 

త్వరలోనే పెండింగ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ పనులను పూర్తి చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. రత్నగిరి ఫౌండేషన్ చైర్మన్ జగన్మోహన్ రావు మాట్లాడుతూ.. సమ్మర్ క్యాంప్ కు ఇంతమంది చిన్నారులు రావడం సంతోషమన్నారు. మరిన్ని కార్యక్రమాలను రత్నగిరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఫౌండేషన్ కన్వీనర్ కేతూరి ధర్మతేజ , ట్రైనర్స్ మగ్బూల్, నాగరాజు, ఉమాపతి, రవి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.