అందుబాటులోకి శ్రీశైలం 4వ యూనిట్.. గ్రిడ్కు అనుసంధానం చేసిన ఆఫీసర్లు

అందుబాటులోకి శ్రీశైలం 4వ యూనిట్.. గ్రిడ్కు అనుసంధానం చేసిన ఆఫీసర్లు
  • ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల విద్యుత్​ ఉత్పత్తి

నాగర్​కర్నూల్, వెలుగు: శ్రీశైలం ఎడమగట్టు భూగర్బ జల విద్యుత్ ​కేంద్రంలో పలుమార్లు పరిశీలించిన అనంతరం 4వ యూనిట్​ను ప్రారంభించారు. జెన్​కో ఉన్నతాధికారులు, ఇంజనీర్లు మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు గ్రిడ్కు అనుసంధానం చేశారు.

శ్రీశైలం లెఫ్ట్​ బ్యాంక్​ పవర్​ హౌజ్​లో 150 మెగావాట్ల కెపాసిటీ ఉన్న ఆరు యూనిట్లకు గాను, ప్రస్తుతం ఐదు యూనిట్లను గ్రిడ్​కు అనుసంధానం చేశారు. ఆరవ యూనిట్​ వ్రైబేషన్, ఫ్రీక్వెన్సీ టెస్టుల అనంతరం గ్రిడ్​కు అనుసంధానం చేస్తామని ఎస్ఈ ఆదినారాయణ తెలిపారు.

శ్రీశైలం జల విద్యుత్​ కేంద్రం కెపాసిటీ 900 మెగావాట్లు​కాగా, ఆరేండ్ల పాటు ఐదు యూనిట్ల ద్వారా 750 మెగావాట్ల విద్యుత్ ను​ఉత్పత్తి చేశారు. 4వ యూనిట్​ అందుబాటులోకి రావడంతో  ప్లాంట్ పూర్తి కెపాసిటీ మేరకు 900 మెగావాట్ల విద్యుత్​ అందుబాటులోకి రానుంది. వారం రోజులుగా శ్రీశైలం పవర్​ హౌజ్లో ఉండి పనులను పర్యవేక్షించిన జెన్​కో డైరెక్టర్​ బాలరాజు, ఎస్ఈ ఆదినారాయణతో పాటు వాయెట్​ కంపెనీ ప్రతినిధులు సాంకేతిక సమస్యలను పరిష్కరించారు.