కొడుకు కోరాడని మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్

 కొడుకు కోరాడని మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాష్ రాజ్
  • ఇవాళ ప్రకాష్ రాజ్-పోనీవర్మల పెళ్లి రోజు
  • మొదటి భార్య పిల్లలతో కలసి సంబరం జరుపుకున్న ప్రకాష్ రాజ్

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తనదైన శైలిలో కుటుంబంలో సంతోషం వెల్లివిరిసేలా చేశాడు. ఇవాళ (ఆగస్టు 24) తన పెళ్లి రోజు సందర్భంగా కొడుకు వేదాంత్ పెళ్లి నేను చూడాలని మంకుపట్టు పట్టడంతో మరోసారి పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లి సంబరానికి మొదటి భార్య పిల్లలు సైతం హాజరయ్యారు. 2009లో డిస్కోశాంతి సోదరి లలితకుమారిని ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈమెకు ముగ్గురు పిల్లలు కలిగారు. ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. అనారోగ్యంతో అబ్బాయి చనిపోయాడు. 
 అటు తర్వాత బాలీవుడ్ కొరియో గ్రాఫర్ పోనీవర్మను ప్రకాష్ రాజ్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి కొడుకు వేదాంత్ కలిగాడు. కరోనా వల్ల చాలాకాలం భార్య పిల్లలతోనే గడిపిన ప్రకాష్ రాజ్.. ఇవాళ పెళ్లి రోజు వేడుకలను కూడా కుటుంబంతోనే గడిపాడు. ఈ సంబరానికి తన మొదటి భార్య ఇద్దరు కూతుళ్లను కూడా పిలిపించుకుని వేడుక చేసుకున్నాడు. మా అబ్బాయి మా పెళ్లి చూడాలని పట్టుపట్టడంతో మేం మళ్లీ పెల్లి చేసుకున్నాం. ఎంతైనా కుటుంబంతో గడిపే సమయం చాలా ఆనందం కలిగిస్తాయంటూ తన అనుభూతిని వెల్లడించారు. తన పెళ్లి సంబరం వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో ప్రకాష్ రాజ్ స్వయంగా షేర్ చేశాడు.