
- ఎన్ బీటీ నగర్ లో ప్రీ మాన్సూన్ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం
- ఐదు రోజుల్లో క్లీన్ చేస్తామన్న అడిషనల్ కమిషనర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజలు ఇండ్లలోని చెత్తను తప్పనిసరిగా స్వచ్ఛ ఆటోలకే ఇవ్వాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. సోమవారం బంజారాహిల్స్ లోని ఎన్ బీటీ నగర్ లో ప్రీ మాన్సూన్శానిటేషన్ డ్రైవ్ ను ఆమె ప్రారంభించి మాట్లాడారు. కొన్ని ఏరియాల్లో చెత్త డబ్బాలు స్థానికులు వాడుకోవడం లేదని, రోడ్లపై చెత్తపోయడంతో దోమలు వ్యాప్తి చెంది, రోగాల భారిన పడే అవకాశం ఉంటుందన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలు రోడ్ల వెంట వేయొద్దని, సీ అండ్ డీ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కి ఫోన్ చేస్తే వారే తీసుకుపోతారన్నారు. డివిజన్లో అవసరమైన చోట హార్వెస్టింట్ పిట్లను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ మాట్లాడుతూ ప్రీ మాన్సూన్శానిటేషన్ డ్రైవ్ లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్ ను మూడు నుంచి ఐదు రోజుల్లో క్లీన్ చేస్తామన్నారు. జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ ప్రజలు సహకరిస్తే క్లీన్ వార్డుగా చేస్తామన్నారు. వాటర్ బోర్డు జీఎం హరిశంకర్, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య పాల్గొన్నారు.