స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించిన రాష్ట్రపతి

స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించిన రాష్ట్రపతి

క్విట్ ఇండియా 77వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధులను సన్మానించారు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్. ఒక్కొక్కరిని కలిసి పలకరించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోమంత్రి అమిత్ షా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు.