థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చు

థర్డ్ వేవ్ రాకుండా అడ్డుకోవచ్చు

భారత దేశంలో కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలపై ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా స్పందించారు. దేశ జనాభాలో అత్యధిక శాతం ప్రజలకు వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకూ రాబోయే నెలల్లో మనం జనసమ్మర్ధ ప్రాంతాల్లోకి వెళ్లకుండా, ప్రమాణాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం థర్డ్ వేవ్ రాకుండా..ఆలస్యం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే దాన్ని తీవ్రతరం కాకుండా పరిమితం చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఇక వైరస్ స్వభావం ఎలా మారుతుందనేది మనం అంచనా వేయలేమని..అయితే రాబోయే నెలల్లో అది అనూహ్యంగా పరివర్తన చెందేలా కనిపించడం లేదని సానుకూలంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా చేపట్టిన సెరో సర్వేలో ఆరు సంవత్సరాలు పైబడిన జనాభాలో 67.6 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు తయారయ్యాయని తేలినట్లు చెప్పారు. దేశంలో కరోనా వైరస్‌ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల క్రమంలో దేశ జనాభాలో ఎక్కువ మందికి మెరుగైన రీతిలో రోగనిరోధక శక్తి ఉందని సెరోసర్వేను తెలుపుతూ చెప్పారు.