
ఓవైపు గాయాలు.. మరోవైపు ఫామ్ కోల్పోయి పరుగుల చేయలేక అవస్థలు.. ఇంకోవైపు సోషల్ మీడియా మహిళా ఇన్ఫ్లుయెన్సర్తో గొడవలు.. కొన్నాళ్లక్రితం వరకూ భారత యువ కెరటం పృథ్వీ షా పడిన కష్టాలివే. అధిక బరువు, ప్రాక్టీస్ సెషన్లకు పదే పదే డుమ్మా కొట్టడం వంటి కారణాలపై భారత యువ క్రికెటర్ పృథ్వీ షాను తప్పిస్తూ ముంబై క్రికెట్ అసోసియేషన్ చర్యలు తీసుకొని జట్టు నుంచి తప్పించడంతో షా కెరీర్ మరింత వెనక్కి వెళ్ళింది. అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేక టీమిండియాకు దూరమైన షా ఐపీఎల్ చాన్స్ కూడా కోల్పోయాడు.
ప్రస్తుతం షా ఎలాంటి క్రికెట్ లో అవకాశాలు లేకుండా తీను చేసిన తప్పుల గురించి మాట్లాడుతూ బాధపడుతున్నాడు. షా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. " తాను కష్టపడుతున్న సమయంలో ఏ 'పెద్ద క్రికెటర్' కూడా తనకు ఫోన్ చేయలేదని షా బాధపడ్డాడు. రిషబ్ పంత్, సచిన్ టెండూల్కర్ మాత్రమే నాకు ఫోన్ చేశారు." అని షా న్యూస్ 24 కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నాడు.
"చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ప్రజలు నన్ను భిన్నంగా చూస్తున్నారు. ఎందుకంటే ఏమి జరిగిందో నాకు తెలుసు. నేను దానిని అర్థం చేసుకోగలను. నేను జీవితంలో చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాను. నేను క్రికెట్కు తక్కువ సమయం ఇవ్వడం ప్రారంభించాను. నేను చాలా ప్రాక్టీస్ చేసేవాడిని. నేను నెట్స్లో 3-4 గంటలు బ్యాటింగ్ చేసేవాడిని. నేను ఎప్పుడూ బ్యాటింగ్ చేయడంలో అలసిపోలేదు. నేను సగం రోజు మైదానానికి వెళ్లేవాడిని. కానీ ఆ తర్వాత ఏదో పరధ్యానంలో వెనకపడ్డాడను".
"ఆ తర్వాత, నేను అవసరం లేని వాటిని అవసరంగా పరిగణించడం ప్రారంభించాను. నాకు కొంతమంది తప్పుడు స్నేహితులు తోడయ్యారు. నేను ఆ సమయంలో అగ్రస్థానంలో ఉన్నాను. దీంతో సహజంగానే నాకు ఫ్రెండ్స్ వచ్చారు. ఈ సమయంలో నేను ట్రాక్ తప్పాను. గ్రౌండ్లో 8 గంటలు ప్రాక్టీస్ చేసే నేను ఇప్పుడు 4 గంటలే అయింది. 2023 వరకు నేను రోజులో సగం సమయం గ్రౌండ్లోనే గడిపేవాడిని. కానీ ఆ తర్వాత కొన్ని అనవసరమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చాను". అని పృథ్వీ షా తన ఆవేదన వ్యక్తం చేశాడు.
తమ తాతయ్య చనిపోయిన తర్వాత చాలా కుంగిపోయినట్లు పృథ్వీ షా చెప్పాడు. తాతయ్య అంటే చాలా ఇష్టమని, ఆయన మరణం తర్వాత జీవితంలో చాలా సంఘటనలు చోటు చేసుకున్నాయని చెప్పాడు. తాను క్లిష్ట సమయాల్లో ఉన్నప్పుడు తండ్రి అండగా నిలిచి, ధైర్యాన్ని ఇచ్చాడని పృథ్వీ షా వివరించాడు. 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఇటీవలే జరిగిన మెగా ఆక్షన్ లో అతన్ని ఎవరూ తీసుకోలేదు. ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కంబ్యాక్ ఇద్దామనుకున్నా సాధ్యం కాలేదు.
ఆరేండ్ల కిందట అండర్ 19 వరల్డ్ కప్ నెగ్గిన కెప్టెన్గా ప్రశంసలు అందుకొని ఇండియా క్రికెట్లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని అనుకున్న పృథ్వీ కెరీర్ అత్యల్ప స్థాయికి చేరుకుంది. సాధారణంగా టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చాటి తిరిగి వస్తుంటారు. అయితే, రంజీలతో పాటు కౌంటీ క్రికెట్లో అప్పుడప్పుడు మెరిసినా షా నేషనల్ టీమ్లోకి తిరిగి రాలేకపోవడానికి కారణం అతని క్రమశిక్షణ లేకపోవడమే. చిన్న వయసులోనే వచ్చిన స్టార్డమ్ అతనిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకప్పుడు ఇరు