కాంగ్రెస్ మద్దతు.. చీర పట్టి ఈడ్చిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు

కాంగ్రెస్ మద్దతు.. చీర పట్టి ఈడ్చిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు

కాంగ్రెస్ ఎంపీటీసీల మద్దతుతో MPPగా ఎన్నికైన టీఆర్ఎస్ అభ్యర్థి
చీర పట్టి ఈడ్చిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు

సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి ఎంపీపీ ఎన్నిక గందరగోళంగా మారింది. 7వ తేదీన జరగాల్సిన ఎంపీపీ ఎన్నిక వాయిదా పడి ఇవాళ జరిగింది. మొగడంపల్లి మండలంలో మొత్తం 11 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. కాంగ్రెస్ 5, టీఆర్ఎస్ 5 స్థానాలు గెల్చుకోగా.. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఏపార్టీకి సరైన మెజార్టీ లేకపోవడంతో మన్నపుర నుంచి టీఆర్ఎస్ ఎంపీటీసీగా గెలిచిన ప్రియాంక.. కాంగ్రెస్ సభ్యుల మద్దతుతో ఎంపీపీగా ఎన్నికైంది. అయితే ఎంపీపీ ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులతో వచ్చిన ప్రియాంకను.. టీఆర్ఎస్ ఎంపీటీసీలు అడ్డుకొని… ప్రియాంక చీర, జుట్టు పట్టుకొని ఈడ్చి అమానుషంగా ప్రవర్తించారు.