హైదరాబాద్, వెలుగు: సిటీలో మరో కొత్త క్యాబ్ అగ్రిగేటర్ రంగంలోకి దిగింది. ప్రైడో పేరిట క్యాబ్ సర్వీసులను ముందుగా హైదరాబాద్లోనూ, ఆ తర్వాత ఇతర మెట్రో నగరాలలోనూ మొదలు పెట్టనున్నట్లు వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ తెలిపింది. హైదరాబాద్లో 14 వేల మంది డ్రైవర్లు ఇప్పటికే తమ భాగస్వాములైనట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు వెల్లడించారు. దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించేందుకు రాబోయే ఏడాది కాలంలో రూ. 100 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపారు. సిటీలో ఈ నెల 29 నుంచి ప్రైడో సేవలు మొదలవుతాయని, ఆండ్రాయిడ్, ఐఓస్లు రెండింటిలోనూ తమ యాప్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. అటు డ్రైవర్లకు, ఇటు కస్టమర్లకు పారదర్శకమైన పద్ధతిలో సేవలు ఇచ్చే విధంగా యాప్ను అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించినట్లు తెలిపారు. హ్యాచ్బాక్, సెడాన్, ఎస్యూవీ మూడు విభాగాలలోనూ ప్రైడో సేవలు పొందవచ్చని అన్నారు. ప్రణీత్ గ్రూప్ పేరిట రియల్ ఎస్టేట్ రంగంలో కార్యకలాపాలు సాగిస్తున్నామని, సొంత నిధులతోనే ప్రైడోను మొదలుపెడుతున్నామని నరేంద్ర కుమార్ చెప్పారు. మూడు నెలల్లో నగరంలో 10 లక్షల రైడ్స్ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. డ్రైవర్లను హ్యాపీగా ఉంచితే రైడర్లు హ్యాపీగా ఉంటారనేదే తమ కంపెనీ సిద్ధాంతమని అన్నారు. దీనికి అనుగుణంగానే తమ బిజినెస్ మోడల్ రూపొందించినట్లు పేర్కొన్నారు. రైడ్స్ సంఖ్య ఆధారంగా నెలకు 0 నుంచి 10 శాతం కమిషన్ను డ్రైవర్ల నుంచి ఛార్జ్ చేయనున్నట్లు తెలిపారు. బిల్లింగ్, ఇన్వాయిసింగ్లో ప్రైడో పూర్తి పారదర్శకత పాటించనున్నట్లు చెప్పారు. గత 12 ఏళ్లలో హైదరాబాద్లో 22 ప్రాజెక్టులు పూర్తి చేసిన ప్రణీత్ గ్రూప్ టర్నోవర్ రూ. 300 కోట్లకు చేరిందని నరేంద్ర కుమార్ తెలిపారు.
సిటీలోకి కొత్త క్యాబ్స్ ‘ప్రైడో’
- బిజినెస్
- September 27, 2019
లేటెస్ట్
- లోకేష్ ను పప్పు అనేది అందుకే.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
- యోగా ఫ్రీ క్లాసులు.. ఎక్కడ.. ఎందుకంటే...
- Good Bad Ugly: మైత్రి నుంచి గుడ్ బ్యాడ్ అగ్లీ అప్డేట్..అజిత్ లుక్తో అంచనాలు పెంచేశారుగా
- మే 20న తెలంగాణ కేబినెట్ సమావేశం
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్
- KKR vs RRR: ఆకస్మిక వర్షం.. రాజస్థాన్ - కోల్కతా మ్యాచ్ ఆలస్యం
- జగన్ 5వేల కోట్లు ఖర్చు చేసినా ఓట్లన్నీ చంద్రబాబుకే.. చింతా మోహన్
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- కామారెడ్డిలో భారీ చోరీ.. 9తులాల బంగారం, 15తులాల వెండి మాయం
- SRH vs PBKS: ఆఖరి పంచ్ మనదే.. పంజాబ్పై సన్రైజర్స్ ఘన విజయం
Most Read News
- రేషన్ షాపుల్లో సన్నబియ్యం
- సన్ రైజర్స్ vs పంజాబ్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియం వద్ద భారీ భద్రత..
- నైరుతి రుతుపవనాల పై కీలకీ అప్డేట్
- తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు.. 24 జిల్లాలకు ఎల్లో అలర్ట్
- వరంగల్ అమ్మాయి, హైదరాబాద్ అబ్బాయి
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి