
ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 1 మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్లో ఘోరంగా విఫలమైంది. గురువారం (మే 29) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో స్వల్ప స్కోర్కే పరిమితమైంది. ఆరంభం నుంచి ఆర్సీబీ బౌలర్లు విజృంభించడంతో సొంత గడ్డపై పంజాబ్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. దారుణమైన బ్యాటింగ్తో 14.1 ఓవర్లలో 101 పరుగులకే కుప్పకూలింది. సయూశ్ శర్మ, హేజల్ వుడ్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. యష్ దయాల్ రెండు, భువనేశ్వర్, షెఫర్డ్ చెరో వికెట్ తీశారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు రెండో ఓవర్లోనే యష్ దయాల్ బిగ్ షాక్ ఇచ్చాడు. ఫామ్లో ఉన్న ప్రియాంష్ ఆర్య (7)ను ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో భువీ పంజాబ్కు మరో ఝలక్ ఇచ్చాడు. చక్కటి లెంగ్త్ బంతితో ప్రభ్ సిమ్రాన్ సింగ్ను ఔట్ చేశాడు. ముందుకొచ్చి భారీ షాట్ ఆడాలని చూసిన సిమ్రాన్ సింగ్ (18) కీపర్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత హేజల్ వుడ్ శ్రేయాస్ అయ్యర్ (2), జోష్ ఇంగ్లిష్ (4) వికెట్లను తీసి పంజాబ్ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు.
ఏడో ఓవర్లో దయాల్ నెహ్యాల్ వధేరాను క్లీన్ బౌల్డ్ చేయడంతో 50 పరుగులకే పంజాబ్ సగం జట్టును కోల్పోయింది. ఈ దశలో ఓ వైపు వికెట్లు పడుతున్నా మార్కస్ స్టోయినిస్ పంజాబ్ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. 17 బంతుల్లో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు బాది 26 పరుగులు చేశాడు. వేగంగా ఆడే క్రమంలో సయుశ్ బౌలింగ్లో ఔట్ అయ్యాడు. చివర్లో అజ్మతుల్లా ఓమర్జాయ్ 18 పరుగులు చేయడంతో పంజాబ్ కనీసం వంద పరుగుల మార్క్ దాటింది. 14.1 ఓవర్లలో 101 పరుగులు చేసి పంజాబ్ ఆలౌట్ అయ్యింది. 26 పరుగులు చేసిన స్టోయినిస్ పంజాబ్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అనంతరం 102 పరుగుల స్వల్ప లక్ష్యంతో ఆర్సీబీ బరిలోకి దిగింది.
Royal Challengers Bengaluru bowled out Punjab Kings for 1⃣0⃣1⃣ in the Qualifier 1 🏏#IPL2025 #PBKSvsRCB #RoyalChallengersBengaluru #PunjabKings #CricketTwitter pic.twitter.com/2YVb38culC
— InsideSport (@InsideSportIND) May 29, 2025