ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో..శుచి ఉపాధ్యాయ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌

 ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో..శుచి ఉపాధ్యాయ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌

ముంబై: ఇంగ్లండ్‌‌‌‌‌‌‌‌ టూర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లే ఇండియా విమెన్స్‌‌‌‌‌‌‌‌ జట్టులో ఒక్క మార్పు చోటు చేసుకుంది. గాయపడిన శుచి ఉపాధ్యాయ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ రాధా యాదవ్‌‌‌‌‌‌‌‌ను టీమ్‌‌‌‌‌‌‌‌లోకి తీసుకున్నారు. శుచి ఎడమ మోకాలి గాయంతో ఇబ్బందిపడుతోందని బీసీసీఐ వెల్లడించింది.

బెంగళూరులోని సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్స్‌‌‌‌‌‌‌‌లో ప్రి టూర్‌‌‌‌‌‌‌‌ క్యాంప్‌‌‌‌‌‌‌‌ సందర్భంగా ఈ గాయాన్ని గుర్తించారని తెలిపింది. ఈ నెల 28, జులై 1, 4, 9, 12న వరుసగా నాటింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌, బ్రిస్టల్‌‌‌‌‌‌‌‌, ఓవల్‌‌‌‌‌‌‌‌, మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌, బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌లో ఈ టీ20లు జరుగుతాయి.