భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ పెళ్లి ప్రస్తావన

భారత్‌ జోడో యాత్రలో రాహుల్‌ పెళ్లి ప్రస్తావన

రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో శనివారం ఓ  సరదా సన్నివేశం చోటు చేసుకుంది.  కన్యాకుమారి జిల్లా మార్తాండం ప్రాంతంలో ఉపాధి హామీ మహిళా కూలీలతో రాహుల్ ముచ్చటించారు. వాళ్ల సంపాదన, స్థితిగతులను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓ మహిళా రాహుల్‌ పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చారు. ‘‘మీరు తమిళనాడును ప్రేమిస్తారని మాకు తెలుసు. తమిళ యువతితో మీకు వివాహం చేయడానికి మేం సిద్ధంగా ఉన్నాం’’ అని  తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ తన ట్విటర్‌లో వెల్లడించారు.  

ఆ సమయంలో రాహుల్ చాలా  సరదాగా కనిపించాడని ఆయన చెప్పారు. అయితే రాహుల్‌ వారికి ఏం సమాధానం ఇచ్చారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. రాహుల్  గాంధీ భారత్ జోడో యాత్ర సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో మొదలైంది కాశ్మీర్ లో ముగుస్తుంది.150 రోజుల పాటు 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలితల ప్రాంతాల గుండా 3,570 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగనుంది.