ఢిల్లీని ముంచెత్తిన భారీవర్షం..ఎల్లో అలెర్ట్​ జారీ

ఢిల్లీని ముంచెత్తిన భారీవర్షం..ఎల్లో అలెర్ట్​ జారీ

ఎండ, వేడిమితో సతమతమవుతున్న ఢిల్లీ వాసులకు ఊరట లభించింది. శనివారం ( జూన్​ 28) మధ్యాహ్నం ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దేశ రాజధానిలో కురిసిన భారీ వర్షంతో షేక్ సారాయ్‌లోని ప్రాట్ రోడ్డులో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. భారీవర్షంతో రోడ్లు కనిపించకపోవడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. రాబోయే రెండు గంటల్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ఎల్లో అలెర్ట్​జారీ చేసింది. 

ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్​ఎయిర్ పోర్టు, వసంత్ విహార్, వసంత్ కుంజ్, హౌజ్ ఖాస్, మాల్వియా నగర్, కల్కాజీ, మెహ్రౌలీ, తుగ్లకాబాద్, ఛత్తర్‌పూర్,సమీప ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. 

VIDEO | Delhi: Traffic disrupted on PRAT road in Sheikh Sarai towards BRT road in Chirag Delhi as rain lashes parts of national capital.#rainalert

(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/o44M9rNLJg

— Press Trust of India (@PTI_News) June 28, 2025

శనివారం ఢిల్లీలో 28.7 సెల్సియస్​ కనిష్ట ఉష్ణోగ్రత  నమోదు అయింది.ఇది రోజువారీ ఉష్ట్రోగ్రతలకంటే 0.8 డిగ్రీలు ఎక్కువగా ఉందని IMD తెలిపింది. శనివారం ,ఆదివారం రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఎన్‌సిఆర్‌లో, నోయిడా, దాద్రీ, గ్రేటర్ నోయిడా, గురుగ్రామ్, ఫరీదాబాద్ , మనేసర్ ,బల్లభ్‌ఘర్ వంటి ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 

ఇక ఢిల్లీ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. హర్యానాలోని జింద్, హన్సి, మెహమ్, మట్టన్‌హైల్, ఝజ్జర్, ఫరూఖ్‌నగర్, సోహ్నా ,పల్వాల్‌ ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని సికింద్రాబాద్, నంద్‌గావ్, బర్సానా, ఆగ్రా ,నగర్, రాజస్థాన్‌లోని డీగ్​ లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చాలా ప్రాంతాల్లో ఉరుములు ,మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షం గంటకు 30నుంచి50 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.