హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్లో పలు  చోట్ల భారీ వర్షం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్

హైదరాబాద్ లో ఉన్నట్టుండి ఒక్కసారిగా వాతావారణం మారిపోయింది.  సాయంత్రం వరకు కూల్ గా ఉండగా.. మేఘాలు కమ్ముకుపోయాయి.   జూబ్లీహిల్స్, బంజారాహీల్స్,  గచ్చిబౌలి, పంజాగుట్ట, యూసఫ్ గూడ, మాదాపూర్, హైటెక్ సిటీ, చందానగర్,  మియాపూర్, కుత్బుల్లాపూర్, సూరారం, సుచిత్ర, కొంపల్లి, చింతల్, షాపూర్ ఏరియాల్లో వర్షం దంచికొడుతోంది. 

 పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే టైం కావడంతో  కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  దీంతో వాహనదారులు ఇండ్లకు చేరుకోవడానికి గంటల సమయం పడుతోంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 

ఈ జిల్లాలకు వాతవరణ శాఖ అలర్ట్..

తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో వర్షం పడనున్నట్లు హెచ్చరించింది వాతావరణ శాఖ.   నవంబర్ 7వ తేదీ రాత్రి హైదరాబాద్, మల్కాజిగిరి, కొత్తగూడెం,  ఖమ్మం,  నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షం పడనున్నట్లు అలర్ట్ ఇచ్చింది. కొన్ని చోట్ల మోస్తరు వర్షం పడనుండగా.. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వాన పడనున్నట్లు స్పష్టం చేసింది. కొన్ని ప్రాంతాల్లో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది వాతావరణ శాఖ.

ఆయా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలు ఉన్నాయని.. ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించింది వెదర్ డిపార్ట్ మెంట్. ఈ సూచనలు, హెచ్చరికలు రాత్రి 7 నుంచి 10 గంటల వరకు అమల్లో ఉంటాయని వెల్లడించింది. రాబోయే రెండు రోజులు.. అంటే నవంబర్ 8, 9 తేదీల్లోనూ చెదురు మదురు వర్షాలు పడతాయని స్పష్టం చేస్తూ.. పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని వెల్లడించింది.