హోం క్వారంటైన్ లోకి రాజస్థాన్‌ సీఎం

హోం క్వారంటైన్ లోకి రాజస్థాన్‌ సీఎం

రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లాట్ ఇవాళ హోం క్వారంటైన్ లోకి వెళ్లారు. ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది సహా తన నివాసంలో పనిచేస్తున్న 10 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం అశోక్‌ గెహ్లాట్ కార్యాలయంతో పాటు ఆయన నివాసంలో 10 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో ముందస్తు జాగ్రత్తలో భాగంగా షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన అన్ని కార్యక్రమాలు, సమావేశాలను  సీఎం రద్దు చేసుకున్నారు. సీఎం కార్యాలయం(CMO)లో పనిచేసే 9 మందికి, ముఖ్యమంత్రి అధికారిక నివాసం (CMR) లో పనిచేసే ఒకరికి కరోనా సోకినట్టు తెలిపింది రాజస్థాన్ ప్రభుత్వం.