భద్రాచలం, వెలుగు : ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ఎదుట ఆదివారం35 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దంతెవాడ, బీజాపూర్, సుక్మా జిల్లాల్లోని బైరంగఢ్, మలంగిర్, కటేకల్యాణ్ ఏరియా కమిటీల్లో పనిచేసే దళ సభ్యులు ఇందులో ఉన్నారు.
లొంగిపోయిన వారిలో ముగ్గురిపై రూ.లక్ష చొప్పున రివార్డు ఉందని, జనజీవన స్రవంతిలోకి వచ్చే మావోయిస్టులకు ప్రభుత్వ పునరావాస పథకం కింద పూర్తి ప్రయోజనాలు అందజేస్తామని దంతెవాడ ఎస్పీ గౌరవ్రాయ్
వెల్లడించారు.